Byఅభ్యసనంలో వెనుకబాటు నుండి ఉత్తమ బోధన వరకు Tr. గాజుల వెంకటేష్ గారి ప్రయాణం :
వెంకటేష్ గాజుల, SGT, MPPS ఉప్పునుంతల బాలురు.
నా పేరు గాజుల వెంకటేష్(పుట్టిన తేది:10-08-1988). మా అమ్మ పేరు లక్ష్మీదేవి, నాన్న పేరు వీరనారాయణ.
నేను ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పనిచేస్తున్నాను.
మాది నల్లమల అడవుల్లో ఉండే మారుమూల గ్రామం మాధవానిపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా.
మా అమ్మ, నాన్న ఇద్దరూ నిరక్షరాస్యులు. చదువుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వారు మాకు ఎలాంటి పనులు చెప్పకుండా ఎంతో కష్టపడి చదివించారు.
నేను ప్రాథమిక విద్యను మా గ్రామంలోనే పూర్తి చేసి అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లింగాలలో 6వ తరగతిలో 1998 సంవత్సరంలో చేరాను. ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నాను.
2002 మే నెల వేసవి సెలవుల్లో అచ్చంపేటలో మా చిన్నమ్మ చంద్రకళ, బాబాయ్ రఘుమయ్య టీచర్ వాళ్ళ దగ్గర ఒక నెల పాటు ఉండి 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ వెళ్లి అక్కడ బేసిక్స్ నేర్చుకోవడం(ఇక్కడ నా మిత్రుడు వెంకటేశ్వర్లు తో సందేహాలు చర్చించేవాడిని) 9వ తరగతి వరకు ఇంగ్లీష్ & గణితంలో బార్డర్ మార్కులతో పాస్ అవుతూ వచ్చిన నేను 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇంగ్లీషులో 83, గణితంలో 99 మార్కులు తెచ్చుకోగలిగాను.
ఆ సంవత్సరం మా పాఠశాల TSWRS&JC లింగాల లో గణితంలో ఇవే అత్యధిక మార్కులు.
ఆ సంవత్సరమే ఉద్యోగంలో చేరిన గణిత ఉపాధ్యాయులు నర్సింహ సార్ బాగా ప్రోత్సహించేవారు.
9వ తరగతిలో గణితం అర్థంకాక వేరే వాళ్ళ నోటు పుస్తకాలు తీసుకుని నేను పదో తరగతిలో మా మిత్రులకు ఎంతో మందికి గణితం అర్థమయ్యేలా చెప్పేవాడిని.
ఈ సంఘటన నా జీవితంలో గొప్ప మార్పును తెచ్చింది .
అదే విధంగా TSWRS&JC అచ్చంపేటలో ఇంటర్ సెకండియర్ చేస్తున్నప్పుడు మా గణిత లెక్చరర్ రామచంద్ర రెడ్డి సారు నాతోపాటు ముగ్గురు మిత్రులతో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ చెప్పించారు.
అలా నేను మా జూనియర్స్ కి మ్యాథ్స్ నాలుగు చాప్టర్లు చెప్పాను.
ఇలా టీచింగ్ చేయడంలో ఆనందం, తృప్తి ఆస్వాదించగలిగాను.
గణితంలో బేసిక్స్ నేర్చుకోవడం ద్వారా నా ఎడ్యుకేషన్లో వచ్చిన మార్పు ఇంకా నాలాంటి ఎంతోమంది ఎడ్యుకేషన్లో మార్పు రావాలని నా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత 2006 మే నెలలో అంటే 16 సంవత్సరాల క్రితం మా గ్రామం మాధవాని పల్లిలో GVNLD ట్యుటోరియల్(మా నాన్న అమ్మ గారి పేరునా గాజుల వీరనారాయణ&లక్ష్మీ దేవి టుటోరియల్) ఉచితంగా గ్రామర్ మరియు 10వ తరగతి అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బోధించడం ప్రారంభించాను. అలా ప్రతి వేసవి సెలవులలో నాకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేవరకు(2010) నాలుగు సంవత్సరాల పాటు ఈ ఉచిత బోధన చేశాను.
ఈ బోధనలో ఈ రోజు చెప్పిన వాటిపై రేపు స్లిప్ టెస్ట్ నిర్వహించే వాడిని. ఇలా ప్రతిరోజు స్లిప్ టెస్ట్, వారానికి వీక్లీ టెస్ట్ కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అప్పటి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు అంజమ్మ గారితో & విద్యా కమిటీ చైర్మన్ గౌరవనీయులు గాజుల చెన్నకిష్టయ్య గారితో బహుమతులు ఇప్పించాను.
2006-08 లో మహబూబ్ నగర్ ప్రభుత్వ డైట్ కళాశాలలో 71 మార్కులతో సీటు పొంది డి.ఎడ్ కోర్స్ పూర్తి చేసి 2008 డిఎస్సీ ద్వారా 70 మార్కులతో ఓపెన్ కాటగిరీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించి తుమ్మన్ పేట ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యాను.
ఇక్కడ సుమారు 6 సంవత్సరాల పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కృషి చేశాను.
ఇక్కడ ఉన్నప్పుడే ఇన్ సర్వీస్లో 2015-17 బి.ఎడ్ పూర్తి చేశాను.
జ్ఞానం వికసించాలంటే గ్రంథాలయం అవసరం అని గ్రహించి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ లోనే 2013 అక్టోబర్లో నాతో పాటు తమ్ముళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు కుంద చెన్నకేశవులు , వెంకటేష్ గారి ఆర్థిక సహకారంతో అవసరమైన పుస్తకాలను సేకరించి గ్రామ పెద్దలు & యువకుల సహకారంతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆదునిక కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని 2017 మే నెలలో Tenses Spoken English వీడియోలు రూపొందించి venkatbta యూట్యూబ్ ఛానెల్లో ఉంచడం జరిగింది.
https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS1PmNrSaru5205RvSTNVDOC
ఈ వీడియోలకు సుమారు లక్ష యాబై వేల వీక్షణలు వచ్చాయి.
గణితంతో పాటు కంప్యూటర్తో పాటు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా చాలా కీలకం కాబట్టి 2018 మే నెల వేసవి సెలవుల్లో మళ్ళీ మా గ్రామంలో సమత కంప్యూటర్ పేరునా మా ఇంటి వద్ద ఉన్న ఒక రూమ్లోనే మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను మా తమ్ముడు శంకర్ గాజుల ఉచిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది.
ఉచిత కంప్యూటర్ శిక్షణ మా అమ్మ నాన్న కోసం:
ఉచిత కంప్యూటర్ శిక్షణపై గ్రామ పెద్దలు & యువకుల స్పందన:
2018లో CCE Grading Excel సాఫ్ట్వేర్ ని విద్యార్థులకు వచ్చిన మార్కులతో అన్ని రకాల గ్రేడింగ్ నివేదికలు వచ్చేటట్లు తయారు చేసి www.venkatbta.com వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది.
https://www.venkatbta.com/2018/10/new-cce-grading-reports-software-v14_55.html
ఈ సాఫ్ట్వేర్ ని ఎలా ఉపయోగించాలో వీడియోను యూట్యూబ్ ఉంచడం జరిగింది.
ఈ CCE గ్రేడింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల అన్ని CCE గ్రేడింగ్ నివేదికలు పొందడంతో పాటు ఉపాధ్యాయుల విలువైన సమయం ఆదా అవుతుంది, అదేవిధంగా విద్యార్థుల గ్రేడింగ్ రిపోర్ట్లు అన్ని ఉపాధ్యాయుల మొబైల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
వీటిని సుమారు పది వేల మందికి పైగా చూశారు. చాలా మంది ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్నారు.
2018 జూలైలో ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలకు బదిలీ కావడం జరిగింది.
ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.
హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ కల్ముల సార్ & నాతో పాటు స్టాఫ్ బాలమణి మేడం, శ్రీనివాస్ మనోపాడు సార్ అందరం కలిసి టీం వర్క్ తో పాఠశాల పరిస్థితి మార్చి పిల్లల సంఖ్యను పెంచే ప్రయత్నం చేశాం.
విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా TLM ఉపయోగించడంతో పాటు డిజిటల్ వీడియో పాఠాలతో బోధన చేస్తున్నాము.
సులభంగా తెలుగు వర్ణమాల నేర్పడం:
సులభంగా గుణింతాలు నేర్పడం:
సులభంగా సంఖ్యలు నేర్పడం:
సంఖ్యలు ప్రాస :
పాచికతో ఆడుతూ అంకెలు నేర్చుకోవడం:
అంకెలు ఎలా లెక్కించాలి:
అంకెలు ఎలా రాయాలి:
కర్రలతో సంఖ్యల పరిచయం:
అబాకస్తో సంఖ్యలను నేర్చుకోండి:
పూసల దండ ఉపయోగించి సంఖ్యలు నేర్పడం :
ఇచ్చిన అంకెలతో సంఖ్యలు ఏర్పరచడం:
ఇచ్చిన అంకెలతో ఏర్పడుతుంది మిక్కిలి పెద్ద సంఖ్య,మిక్కిలి చిన్న సంఖ్యలు రాయడం:
సులభంగా ఎక్కాలు నేర్పడం:
చేతి వేళ్ళతో 9వ ఎక్కం:
9వ టేబుల్ ట్రిక్స్:
19వ ఎక్కం సులభంగా గుర్తించుకోవడం:
100 వరకు ఎక్కాలు సులభంగా చెప్పడం:
సులభంగా English Alphabet నేర్పడం:
ఆల్ఫాబెట్ సాంగ్:
అకారాది పదాలు:
ఆల్ఫాబెట్ ఎలా వ్రాయాలి:
పండ్ల పేరు:
మొబైల్లో పవర్ పాయింట్ స్లయిడ్లతో డిజిటల్ పాఠాలను ఎలా తయారు చేయాలి:
1వ తరగతి తెలుగు 1వ పాఠం తబల డిజిటల్ పాఠం:
మొదటి భాగం:
రెండవ భాగం:
6 నిమిషాల్లో 12 కాలాలు:
ఏకాగ్రత కోసం ప్రతిరోజూ ఉదయం ప్రార్థన తరువాత 5 నిమిషాల పాటు విద్యార్థులతో ధ్యానం చేయిస్తాము.
అదేవిధంగా 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి.
మండల స్థాయిలో అకడమిక్ మానిటరింగ్ టీంలో
V TGCET 2019 లో ఐదుగురిని ఎక్జామ్ రాపిస్తే నలుగురికి సీట్లు వచ్చాయి.
హెడ్మాస్టర్ సార్ తన ఇంటి వద్ద ఉన్న కంప్యూటర్ ను పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది.
విద్యార్థులకు కంప్యూటర్ తో డిజిటల్ భోధన చేస్తూ ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం.
విద్యార్థులతో ల్యాప్ టాప్ మోడల్ తయారు చేయించి టైపింగ్ నేర్పిస్తున్నాము.
స్థానిక సర్పంచ్ కట్ట సరిత మేడంగారి సహకారంతో పాఠశాలకు రంగులు వేయించి పాఠశాలను చాలా అందంగా తయారు చేయించారు.
తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు 1వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాము.
నాడు: ఎంపీపీఎస్ ఉప్పునుంతల అబ్బాయిలు
నేడు: MPPS ఉప్పునుంతల అబ్బాయిలు
మా పాఠశాలలో సీట్లు వచ్చిన విషయం తెలుసుకొని మా స్వంత చెల్లెలు కొడుకు అంటే మా మేనల్లుడు వరప్రసాద్ ను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మా పాఠశాలలో చేర్చారు. మా అల్లుడు మా దగ్గరే ఉండి నాతో పాటు పాఠశాలకు వచ్చి చదువుకునేవాడు.
యం.వరప్రసాద్
ఇంటి వద్ద నా జీవిత భాగస్వామి భౌతిక మా అల్లుడిని చదివేది.
2020 మార్చిలో పిల్లల వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. ఏప్రిల్ లో గురుకుల 5వ తరగతి ప్రవేశాల కోసం venkatbta యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది.
https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS0FJbp_DuBv-8uXlsJb86mw
ఈ వీడియోలకు లక్ష వ్యూస్ వచ్చాయి.
V TGCET 2020 లో కూడా ఐదుగురిని ఎక్జామ్ రాపిస్తే మా అల్లుడితో పాటు మరో ఇద్దరికీ సీట్లు వచ్చాయి అంటే మొత్తం మూడు సీట్లు వచ్చాయి.
మా అల్లునికి సీటు వచ్చినందుకు మా వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు.
గొంతు వల్ల 2020 మార్చి నుండి 17 నెలల పాటు విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు.
గురుకుల పాఠశాలల్లో చదువుకొని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన నేను నా జీవిత భాగస్వామితో కలిసి వేసవి/కరోనా సెలవుల్లో 2021 మే 21న మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ఉచిత ఆన్లైన్ తరగతులకు గౌరవనీయులు బల్మూర్, అచ్చంపేట & ఉప్పునుంతల మండలాల విద్యాధికారి రామారావు రామావత్ సార్ & ఉప్పునుంతల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రెడ్డి సార్ ల చే ప్రారంభించాము.
ఈ ఆన్లైన్ తరగతుల్లో ప్రత్యేకత ఏందంటే ఎవ్వరైనా ఎక్కడైనా క్లాస్లో జాయిన్ కావచ్చు వారి ఇంట్లో ఉండేలా చూడొచ్చు అలాగే మనం చెప్పే వీడియో&డిజిడ్ డిస్ప్లే పైన రాసిన అక్షరాలు కనిపిస్తాయి, అదేవిధంగా విద్యార్థులు మనకు కనిపిస్తారు, విద్యార్థులతో మనము ప్రత్యక్షంగా ఇంటరాక్టివ్ కావచ్చు, వారు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే మనల్ని లైవ్లో నివృత్తి చేసుకోవచ్చు.
విజయవంతంగా 30 రోజులలో 4వ తరగతి తెలుగు, ఇంగ్లీష్, గణితము & పరిసరాల విజ్ఞానం లను V TGCET పరీక్షల దృష్ట్యా అన్ని పాఠాలను పూర్తి చేసి ఉచిత ఆన్లైన్ తరగతులు పూర్తి చేయడం జరిగింది.
ఉచిత ఆన్లైన్ కార్యక్రమాల కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల స్పందన:
గురుకుల 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష 202 ఫలితాల్లో ఉచిత ఆన్లైన్ తరగతులకు హాజరైన 30 మంది విద్యార్థులకు సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా యూట్యూబ్లో ఈ వీడియోలను లక్షకు పైగా విద్యార్థులు చూసారు. ఇందులో సీట్లు పొందిన వారు వందల్లో ఉంటారు.
గురుకుల ఆన్లైన్ తరగతుల గురించి రిటైర్డ్ MEO బాల్ జంగయ్య సార్ స్పందన: https://youtu.be/l6241-KxRQY
సీట్లు పొందిన వారిలో కొందరి వివరాలు:
V TGCET 2021లో మన బాలుర ప్రాథమిక పాఠశాల నుండి కూడా ఐదుగురిని పరీక్ష రాయిస్తే నలుగురికి సీట్లు వచ్చాయి.
నేను పనిచేసే మన బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలోనే మా బాబు గౌతమ్ ను చేర్చి నాణ్యమైన విద్యను మా విద్యార్థులతో పాటు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీనివల్ల మనపైన మరింత బాధ్యత పెరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా మన పాఠశాల పైన నమ్మకం పెరుగుతుంది.
జూన్ 30, 2021న మండల విద్యాశాఖాధికారి గౌరవనీయులు రామారావు సార్ మరియు ఉప్పునుంతల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు హనుమంత్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మా కుమారుడు గౌతమ్ మరియు మేనల్లుడు విద్యాసాగర్లలో నేను నిర్వహిస్తున్న మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను ఎందుకు చేర్చాలి:
మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న వివిధ కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. 2018 జూలైలో మేము ఈ పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 31 మంది విద్యార్థులు ఉండగా నేడు 131 మంది విద్యార్థులు ఉన్నారు.
పాఠశాలలో మౌళిక వసతులు కల్పన కోసం బడికి చందా ఇంటికి వంద అనేదానిని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ లు ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున బడికి చందా ఇచ్చారు. తర్వాత SMC చైర్మన్ రాములు గారు కూడా వెయ్యి రూపాయలు బడికి చందా ఇచ్చారు. విద్యార్థులు స్వచ్చందంగా వంద రూపాయలు ఇచ్చి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది.
చర్మ పరిస్థితుల నేపథ్యంలో బడులు తెరిచే పరిస్థితి లేదు. కాబట్టి విద్యార్థులకు విద్య అందించాలంటే డిజిటల్ ఆన్లైన్ బోధన ఒక్కటే ఇప్పుడున్న మార్గం. కానీ కొద్ది మంది ఉపాధ్యాయులకే డిజిటల్ టెక్నాలజీపై అవగాహన ఉంది. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు ఈ డిజిటల్ ఆన్లైన్ బోధన అంశాల పట్ల అవగాహన కల్పిస్తే వారందరూ డిజిటల్ ఆన్లైన్ బోధన ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు విద్యను అందిస్తారు.
కాబట్టి ఉపాధ్యాయుల కోసం ఉచిత డిజిటల్ బోధన పైన 5రోజుల శిక్షణను 03-08-2021 న ప్రారంభించడం జరిగింది.
ఆన్లైన్ శిక్షణ షెడ్యూల్:
క్రింది తేదీలలో
ఉదయం 11:30 గం.ల నుండి మధ్యాహ్నం 12:30 గం.ల వరకు ఉంటుంది.
👉03-08-2021: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్ లు రూపొందించడం
(ప్రస్తుతం DD Yadagiri/ T-SAT లో ప్రసారం అవుతున్న డిజిటల్ పాఠాలు వీటి ఆధారంగానే చెప్తున్నారు)
1వ రోజుల వీడియో లింక్: https://youtu.be/bJrJ3KTJ-p4
👉 05-08-2021: స్ర్కీన్ రికార్డింగ్ & వీడియో ఎడిటింగ్
(పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్ లతో బోధిస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియో ఎడిటింగ్ చేయడం)
2వ రోజు వీడియో లింక్: https://youtu.be/W_H-mr418dU
👉07-08-2021: Kinemaster యాప్ ద్వారా డిజిటల్ వీడియో ఎడిటింగ్
3వ రోజు వీడియో లింక్: https://youtu.be/RzTFCyKVpTg
👉10-08-2021: గూగుల్ ఫామ్స్ ద్వారా వర్క్షీట్లు/అసైన్మెంట్స్ రూపొందించడం
4వ రోజు వీడియో లింక్: https://youtu.be/HA2DStYk88U
👉12-08-2021: జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ బోధన చేయడం.
5వ రోజు వీడియో లింక్: https://youtu.be/7ahhCs_4-_E
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల సమాలోచన:https://youtu.be/GwiQdj0wANI
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి కంప్యూటర్ విద్యను అందించడానికి కంప్యూటర్ ల్యాబ్ కోసం ఇమ్మడి సైదులు గారు సాఫ్ట్వేర్ ఉద్యోగి మరియు ప్రొఫెసర్ మోటమారి మధు గారు రెండు కంప్యూటర్లను పాఠశాలకు విరాళంగా ఇవ్వడం జరిగింది.
విద్యారంగంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న కృషికి గాను జిల్లా స్థాయిలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా విద్యా దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సార్, గౌరవ విప్, MLA లు గువ్వల బాల్ రాజు సార్, జనార్ధన్ రెడ్డి సార్, విద్యా శాఖాధికారి గోవిందా రాజులు సార్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించారు.
ఇంకా venkatbta యూట్యూబ్ చానెల్ ద్వారా విద్యా,ఉద్యోగ,ఉపాధి& టెక్నాలజీ విషయాలలో ప్రజలలో Educate చేయడం జరుగుతుంది.
https://youtube.com/c/venkatbta
ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. వీటిపై సరైన అవగాహన లేక ఇవి కాలేక మళ్ళీ మళ్ళీ ఈ పరీక్షలు రాస్తూ ఉంటారు ఇవి పాస్ కానందుకు కొంత మంది ప్రమోషన్ కోల్పోయిన వారు ఉంటారు. నేను ఈ పరీక్షలు పాసైన తర్వాత ఓకే సారి ఈ డిపార్ట్మెంట్ పరీక్షలు ఎలా పాస్ కావాలి అని 2018 డిసెంబర్లో వీడియో చేసి యూట్యూబ్ చానెల్లో ఉంచడం జరిగింది.
ఈ వీడియోకు సుమారు లక్ష వీక్షణలు వచ్చాయి.
చాలా మంది ఈ వీడియో చూసి మేము ఒకే సారి పాస్ అయ్యామని కామెంట్స్ ద్వారా ఫోన్ ద్వారా తెలిపినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని వెలకట్టలేము.
యూట్యూబ్ ఛానల్, ఫోన్, ఇతర సోషల్ మీడియా ద్వారా అందిస్తున్న సూచనలు, సలహాలు ఎందరో ఉద్యోగార్థులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడుతున్నవి.
ఒక ఉద్యోగార్థి స్పందన: https://youtu.be/tND11eCjDOE
2015 జనవరిలో కంప్యూటర్లో అను స్క్రిప్ట్ మేనేజర్తో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో ఇంటర్నెట్ ద్వారా స్వయంగా నేర్చుకొని తర్వాత సులభంగా ఎలా తెలుగు టైపింగ్ చేయాలో చార్ట్ తయారు చేసి www.venkatbta.com వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది.
యాపిల్ కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్:
https://www.venkatbta.com/2017/03/anu-script-manager-70-apple-key-board.html
రోమా కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్:
https://www.venkatbta.com/2017/03/anu-script-manager-70-roma-key-board.html
వీటిని ఇప్పటి వరకు లక్ష ఎనబై వేల మంది చూశారు.
అదేవిధంగా 2017 లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో రెండు వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడితే ఇప్పటి వరకు వాటిని యాభైవేల మంది చూశారు.
యాపిల్ కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్ వీడియో:
రోమా కీబోర్డు ద్వారా తెలుగు టైపింగ్ వీడియో:
ప్రతి రోజూ ఒకరిద్దరైనా ఈ తెలుగు టైపింగ్ గురించి ఫోన్ చేస్తూ ఏమైనా డట్స్ ఉంటే నివృత్తి చేసుకొని మీ చార్ట్ వల్ల, వీడియో వల్ల ఇంటి వద్ద సులభంగా తెలుగు టైపింగ్ నేర్చుకొంటున్నాం అని కృతజ్ఞతలు చెబుతుంటే చాలా సంతోషం.
జూలై 7, 2021 నుండి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం ప్రతి రోజూ ఉదయం 6 గంటల తర్వాత పత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తలు వాటి విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది:
https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS2xYGlkfHQJAd6lnw8LimvV
మనకు తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి పంచడంలో చాలా ఆనందం ఉంటుంది.
ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మలుపు ఉంటుంది మనం దాని నుంచి స్పూర్తి పొంది సమాజానికి ఉపయోగపడేలా మనవంతు ప్రయత్నం చేయాలి.
పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తేవడానికి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, హక్కులు కల్పించడానికి మహనీయులు గౌతమ బుద్ధుడు, పూలే దంపతులు, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొదలైన వారు ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో పోరాటాలు చేసి వారి జీవితాలను సహితం త్యాగం చేసి మనకు ఈ అవకాశాలు కల్పించారు.
వారి స్ఫూర్తితో వారు చూపిన పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మాకు చాలా సంతృప్తినిస్తుంది.
జై భీమ్!
We are because They wer
0 comments:
Post a Comment